18, అక్టోబర్ 2014, శనివారం

అమెరికా సైనిక జోక్యపు విషవలయం

                    ఇరాక్‌, సిరియాల్లో అమెరికా సైనిక జోక్యం ఆ ప్రాంతంలో మరింతగా ఘర్షణలు చెలరేగడానికే దారి తీసింది. ఆగస్టులో ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులపై బాంబు దాడులు జరుపుతున్నట్లు అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదుల వల్ల ముప్పునెదుర్కొంటున్న యజీదీలను కాపాడేందుకు అమెరికా జరిపే ఈ వైమానిక దాడులు మానవతా ఉల్లంఘన కిందకే వస్తాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై జరిపే పోరాటానికి కాల పరిమితి లేదని ఒబామా ప్రకటించారు. అవసరమైతే ఏళ్ళ తరబడి కూడా

గుప్పెడు మంది గుత్తాధిపత్యం

                   దేశం వృద్ధి రేటు ఉరకలెత్తుతున్నప్పుడే కాదు, పతనమైనప్పుడు కూడా అపర కుబేరుల వద్ద సంపద పోగుపడుతూనే ఉంది. ఒక వైపు రోజుకు రూ.20 కూడా ఆదాయం లేని అభాగ్యులు 77 శాతం మంది ఉంటే ఇంకోవైపు గుప్పెడు మంది కుబేరులు జిడిపిలో 50 శాతం సంపదను గుప్పెట్టో పెట్టుకుని కులుకుతున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా మెక్సికోకు చెందిన కార్ల్‌ నస్లిమ్‌ ఫోర్బ్స్‌ జాబితాకెక్కితే, ముంబయిలో నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో 27 అంతస్తుల ఆకాశ హర్మ్యాలతో ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి

నల్లధనుల గుట్టు విప్పలేం!

- సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన మోడీ సర్కార్‌
- ఎన్నికల హామీపై బిజెపి పిల్లిమొగ్గలు
                         న్యూఢిల్లీ: నల్ల ధనంపై బిజెపి బండారం బయటపడింది. తమకు అధికారమిస్తే నల్లధనుల అంతుచూస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. గద్దెనెక్కిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కింది. నల్లధనుల పేర్లు బయటపెట్టలేమని ఇప్పుడు మాట మార్చింది. ఎన్నికల ముందు ఒక మాట, తరువాత ఒక మాట మాట్లాడడం బిజెపికే చెల్లింది.. స్విస్‌ బ్యాంకులోను, ఇతర పన్ను ఎగవేత

ఒక వైపు ఆహారం వృథా... మరో వైపు ఆకలి చావులు

                      హవానా: ప్రపంచ వ్యాప్తంగా ఏటా వృధా అవుతున్న ఆహార పదార్ధాలు 13 లక్షల టన్నుల పైమాటేనని ప్రపంచ ఆహార సంస్థ అంచనా వేస్తోంది. ఈ వృధాను అరికట్ట గలిగితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సంభవిస్తున్న ఆకలిచావులను చాలావరకు అరికట్టవచ్చని అమెరికాకు చెందిన సామాజిక వేత్త రాబ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఆకలి, వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు, మతిమాలిన ప్రభుత్వ విధానాలు, ఆయుధాల మార్కెట్‌లో కొనసాగుతున్న పోటీలే అత్యంత

13, అక్టోబర్ 2014, సోమవారం

దళిత - బహుజన పత్రికపై దాడి


                   న్యూఢిల్లీ : దళిత, ఒబిసి, గిరిజనుల గొంతుకగా పేర్కొంటున్న మాసపత్రిక 'ఫార్వర్డ్‌ ప్రెస్‌' కార్యాలయంపై ఢిల్లీ పోలీసులు దాడిచేసి అక్టోబర్‌ సంచిక ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి, కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. 'బహుజన - శ్రామిక సంప్రదాయాలు' అంశంపై తెచ్చిన ఈ ప్రత్యేక సంచిక హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ఎబివిపి కార్యకర్తలు ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం పత్రిక కార్యాలయంపై దాడి జరిపారు. అలాగే ఢిల్లీలో అనేక

హాంకాంగ్‌ నిరసనలకు అమెరికా ఆజ్యం - చైనా విమర్శ

            బీజింగ్‌ : ప్రజాస్వామ్య సంస్కరణల పేరుతో హాంకాంగ్‌లో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు అమెరికా ఆజ్యం పోస్తోందని చైనా విమర్శించింది. వీటి వెనుక వాషింగ్టన్‌కు చెందిన నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఇడి) అనే స్వచ్ఛంద సంస్థ ప్రమేయం వుందని చైనా అధికార పత్రిక వెల్లడించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో విదేశీ ప్రభుత్వాలను కూలదోసే అమెరికా కుట్రలో భాగంగానే ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయని విమర్శించింది. ఈ ఆందోళనలపై విద్యార్ధులను రెచ్చగొట్టేందుకు, వారితో చర్చించేందుకు ఎన్‌ఇడి డైరెక్టర్‌ లూసియా గ్రీవ్‌ కొద్ది నెలల

ఘన విజయ పథంలో ఇవో మొరేల్స్‌


                   ఆదివారం నాడు జరిగే బొలీవియా ఎన్నికలలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ తొలి విడత ఓటింగ్‌లోనే ఘన విజయం సాధించనున్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. ఐదు పార్టీలు పోటీ చేస్తున్న ఈ ఎన్నికలలో మొరేల్స్‌ 74శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేలు తెలిపాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో 40శాతం ఓట్లు తెచ్చుకొని సమీప ప్రత్యర్థిపై కనీసం పదిశాతం

బ్రెజిల్‌ గవర్నర్‌గా కమ్యూనిస్టు

                 గత ఆదివారం నాడు జరిగిన బ్రెజిల్‌ ఎన్నికలలో తొలిసారిగా 27 రాష్ట్రాలకు గాను ఒక చోట కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఫ్లావియో దినో గవర్నర్‌గా ఎన్నికయ్యాడు. పదిహేను సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన 45 సంవత్సరాల ఫ్లావియో ఉద్యోగానికి రాజీనామా చేసి 2006లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. బ్రెజిల్‌ నియంతల పాలనలో కమ్యూనిస్టుగా ఉన్నందుకు ఆయన తండ్రి 32 సంవత్సరాల పాటు జైలులో ఉన్నారు. ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ పది హేడు రాష్ట్రాల అసెంబ్లీలలో 25 స్థానాలను, పార్లమెంట్‌లో తొమ్మిది రాష్ట్రాల నుంచి పది స్థానాలను గెలుచుకుంది. వామపక్ష వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ రెండవ సారి అధ్యక్ష పదవికి పోటీ పడుతూ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 26 తుది విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమెకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఫెర్గూసన్‌ కమ్యూనిస్టులపై అక్కసు


                    అమెరికాలోని మిసోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్‌ పట్టణంలో ఆగస్టు నెలలో మైఖేల్‌ బ్రౌన్‌ అనే నల్లజాతి యువకుడిని అకారణంగా పోలీసులు కాల్చిచంపిన ఉదంతం తెలిసిందే. ఇంతవరకు హత్య చేసిన పోలీసుపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోనందుకు నిరసనగా ఈనెల 10-13 తేదీలలో దేశవ్యాపిత ఆందోళనకు వివిధ సంస్థలు పిలుపునిచ్చాయి. దానికి సంబంధించిన వార్తను పూర్తి వివరాలతో కమ్యూనిస్టు పార్టీ ఇంటర్నెట్‌ పత్రిక 'పీపుల్స్‌ వరల్డ్‌' ప్రచురించటాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ప్రధాన స్రవంతి మీడియా వదలి పెట్టిన అంశాన్ని ఉపయోగించుకొని బలపడేందుకు, ఆ సమస్యను ఇంకా సజీవంగా కొనసాగించేందుకు

పేదరికపుటంచుల్లో అమెరికన్‌ కుటుంబాలు

                      న్యూయార్క్‌: అమెరికాలోని పది రాష్ట్రాల్లో ని అనేక కుటుంబాలు ప్రస్తుతం పేదరికపుటంచుల్లో కాలం గడుపుతున్నాయి. ఈ కుటుంబాలకు ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతే వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు అవసరమైన వనరులు కూడా వారికి లేవు. ఒక వేళ కుటుంబ యజమాని ఉద్యోగం కోల్పోయినా, ఆతడి భార్య, లేదా సంతానం అస్వస్థతకు గురైనా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు ఎదురైనపుడు అమెరికాలోని అనేక